13 ఏళ్ల బాలిక, ఏడుగురు కామాంధులు.. చివరికి?
ఆడ పిల్లల పై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు ఎన్నో కఠిన చట్టాలు తీసుకువచ్చాం.. ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తాం అంటూ ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయ్. కానీ నేటి రోజుల్లో మాత్రం ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలకు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ప్రతి రోజూ దేశంలో ఎక్కడో ఓ చోట ఆడపిల్ల కామపు కోరల్లో చిక్కుకొని బలి అవుతూనే ఉంది. మానవత్వమున్న మనుషులే మానవ మృగాలుగా మారిపోయి కామంతో మీద పడుతుంటే ఈ లోకంలో ఆడపిల్లగా పుట్టడమే శాపమా అని ప్రతి ఆడపిల్ల కుంగిపోతుంది.
ఈ మధ్యకాలంలో ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్లోని రాంచీలో దారుణ ఘటన వెలుగు చూసింది 13 సంవత్సరాల బాలికపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని. అయితే అత్యాచారానికి పాల్పడిన వారిలో నలుగురు మైనర్లు ఉండటం గమనార్హం. ఆగస్టు 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసిన మైనర్ల లో ఒకరికి ఆ బాలికతో పరిచయం కూడా ఉందట. ఈ క్రమంలోనే మాయ మాటలతో నమ్మించి 13 ఏళ్ల బాలికను ఒక ప్రాంతానికి పిలిచిన బాలుడు.. ఇక తన స్నేహితులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.