అన్న రాఖీ కట్టుకోలేదని.. చెల్లి షాకింగ్ నిర్ణయం?

praveen
అన్న చెల్లెలు ఎక్కడ ఉన్నా రక్షాబంధన్ వచ్చింది అంటే చాలు ఒక చోట చేరిపోతారు. ఇక చెల్లెల్లు ఎంతో ప్రేమగా అన్న చేతికి రాఖీ కడితే.. ఇక అన్న ఎంతో ప్రేమగా చెల్లిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంతేకాదు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అని మర్చిపోవద్దు అంటూ భరోసా ఇస్తూ ఉంటాడు.  అయితే రాఖీ పౌర్ణమి రోజున హిందూ ముస్లింలు అనే తేడా ప్రతి ఒక్క అన్నాచెల్లెలు ఇక ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.  ఇక ఎంత బిజీగా ఉన్నప్పటికీ రక్షాబంధన్ రోజు ఇక అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది.



 ఒకవేళ ఇలా రక్షాబంధన్ రోజు ఇక అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టించుకోకపోతే  ఏదో కోల్పోయినట్టు గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అన్నయ్యకు రాఖీ కట్టకపోతే చెల్లెలు కూడా ఎంతగానో బాధ పడుతూ ఉంటారు.  అయితే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ రోజు అన్న చేసిన పని ఏకంగా చెల్లి ప్రాణాలు పోయేంత వరకు దారి తీసింది. అన్నాచెల్లెళ్ల మధ్య అనురాగం పెంచాల్సిన రాఖీ పండుగ చివరికి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత కు దారి తీసింది.



 ఏకంగా అన్న రాఖీ కట్టుకోలేదు అన్న కారణంతో చెల్లి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. మాణిక్ ప్రభు వీధికి చెందిన మమత ఎంతో సంతోషంగా అన్నకు రాఖీ కట్టడానికి వెళ్ళింది. కానీ అన్న మాత్రం చెల్లి తో ఎంతో సంతోషంగా రాఖీ కట్టించుకోవాల్సింది పోయి..  రాఖీ కట్టుకునేందుకు నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందింది మమత. ఇక రక్షాబంధన్ రోజు అందరికీ  అన్నకి రాఖీ కట్టే లేకపోయాను అన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది. దీంతో ఇంట్లో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: