ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్... ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా రిపబ్లిక్ డే కానుకగా షాపింగ్ ప్రియుల కోసం గ్రేట్ ఇండియన్ సేల్ ను తీసుకొచ్చింది. ఈనెల 19న ఈ సేల్ ప్రారంభమై 22న అర్ధరాత్రి 12గంటలకు ముగియనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం 18వ తేదీ మధ్యాహ్నం 12గంటలనుండి ఈ సేల్ ను యాక్సెస్ చేసుకొనే వెసులుబాటును కల్పించింది.
ఇక కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ సేల్ ద్వారా భారీ ఆఫర్లను ప్రకటించింది అమెజాన్. అందులో భాగంగా స్మార్ట్ ఫోన్స్ పై 40శాతం తగ్గింపు ను ప్రకటించగా ఎలక్ట్రానిక్స్ , గృహోపకరణాలు , ఫ్యాషన్ తదితర వస్తువులపై 60శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది అలాగే అమెజాన్ ఉత్పత్తుల పై 45శాతం వరకు డిస్కౌంట్ అందించనుంది. అంతేకాకుండా ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికి 10శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా అందించనుంది. వీటితో పాటు కొత్త కస్టమర్లకు ఉచిత డెలివరీ సదుపాయం కూడా అందివ్వనున్నామని అమెజాన్ తెలిపింది.
ఇదిలా ఉంటే మరో ప్రముఖ ఈకామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ కూడా అమెజాన్ కు పోటీగా రిపబ్లిక్ డే సేల్ ను తీసుకరావాడానికి రెడీ అవుతుంది. కాగా ఇంతవరకు ఈసేల్ గురించి ఫ్లిప్ కార్ట్ నుండి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే అతి త్వరలో ఈసేల్ తేదీలను ప్రకటించనుందని సమాచారం. కస్టమర్ల ను ఆకట్టుకోవడానికి భారీ ఆఫర్ల తో రానుంది ఫ్లిప్ కార్ట్.