పిఠాపురం వెళ్తున్న పవన్‌ కల్యాణ్‌.. రచ్చ రచ్చేనా?

Chakravarthi Kalyan
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన ఖరారైంది. జులై1వ తేదీ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తారు. జులై 1వ తేదీన  సాయంత్రం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహిస్తారు. మూడు రోజులపాటు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. కాకినాడ జిల్లా అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ సమీక్షిస్తారు.
పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే ఈ నెల 29వ తేదీన తెలంగాణలోని కొండగట్టుకు పవన్ కళ్యాణ్ వెళ్తారు. కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని పూజాదికాలు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తారు. ఉద్యోగ సంఘ నేతలతో ఇటీవల సమావేశమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. దేశం మెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సొబగులు అద్దాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: