మోదీ ముందు దేశానికి క్షమాపణ చెప్పు.. అసదుద్దీన్ డిమాండ్?
ప్రభుత్వం నుంచి విద్యార్థులకు న్యాయం జరగాలని.. నరేంద్ర మోదీ ఎగ్జామ్ వారియర్ అంటూ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ప్రధాని మోదీ దేశ యువత భవిష్యత్తును పణంగా పెట్టారని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మొదట NEET UG పరీక్షను రద్దుచేసి 23 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేశారని.. ఆ తర్వత UGC-NET ద్వారా 9 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేశారని అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. CSIR-NET రద్దు చేసి 2 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న అసదుద్దీన్ ఒవైసీ.. ఇప్పుడు NEET-PG పరీక్షకు రాత్రి ముందు రద్దు చేశారన్నారు.