ఇవాళ పాతబస్తీ వీధుల్లో అమిత్షా టూర్.. మాధవీలత ఖుషీ?
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు రోడ్ షోలో పాల్గొననున్న అమిత్ షా.. రోడ్ షో ముగించుకుని నేరుగా భాజపా రాష్ర్ట కార్యాలయానికి వెళ్తారు. రాత్రి 9:15 నుంచి 10:15 వరకు భాజపా రాష్ర్ట కార్యాలయంలో ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం అవుతారు. నాగర్ కర్నూల్, చేవెళ్ల, మహాబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశంకానున్న అమిత్ షా.. ఈ సమావేశం అనంతరం బేగంపేట ఐటీసీ కాకతీయకు రాత్రి 10:30కి చేరుకుంటారు. రాత్రి ఐటీసీ కాకతీయలోనే బస చేయనున్న అమిత్ షా.. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్తారు.