తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మరో కానుక ఇవ్వబోతున్నారు. జులై నుంచి రాష్ట్ర ప్రజలకు హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందజేయనున్నారు. మంత్రి శ్రీధర్బాబు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రజలు గర్వించేలా పనిచేస్తామన్న మంత్రి శ్రీధర్బాబు.. ఆధార్ కార్డు సంఖ్య తరహాలో ఒక్కో పౌరుడికీ స్మార్ట్కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ సంఖ్యతో గుర్తింపు కల్పిస్తామన్నారు. పేరు టైప్ చేస్తే సమగ్ర వైద్య సేవల వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టామని మంత్రి శ్రీధర్బాబు వివరించారు.
ఏ వైద్యుడిని సంప్రదించినా వారి ఆరోగ్య స్థితిగతులను వెంటనే తెలుసుకుని మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఇది దోహదపడుతుందని మంత్రి శ్రీధర్బాబు అంటున్నారు. తన తండ్రి శ్రీపాదరావు మరణానంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తనను పార్టీలోకి ఆహ్వానించారన్న మంత్రి శ్రీధర్బాబు.. అప్పట్లో తన తల్లి జయశ్రీ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేసుకున్నారు.