హోరెత్తించబోనున్న జగన్.. కూటమి తట్టుకుంటుందా?
నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల సభలు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. ఈనెల 27న ఉదయం ఇడుపుల పాయలో వైఎస్ ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్న సీఎం జగన్.. బస్సుయాత్ర ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు ప్రొద్దుటూరు చేరుకుని తొలి బహిరంగసభలో పాల్గొంటారు. ప్రతి రోజూ ఉదయం 9.30 కు వివిధ వర్గాల ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి ఉంటుంది. ఈ నెల 28 న నంద్యాల లో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల బహిరంగ సభ ఉంటుంది. ఈ నెల 30 న ఎమ్మిగనూరు లో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల బహిరంగ సభ ఉంటుంది.