రైతుల కోసం హైదరాబాద్‌లో అద్భుత ప్రదర్శన?

Chakravarthi Kalyan
రైతుల కోసం హైదరాబాద్‌లో అగ్రిటెక్‌ సౌత్ - 2024 పేరిట ప్రదర్శన జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల స్థాయి ఈ ప్రదర్శనలో కొలువు తీరిన 150 స్టాళ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారత్‌లో వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సూక్ష్మ సేద్యం పరికరాలు, సూక్ష్మ రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, నాణ్యమైన విత్తనాలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
అలాగే ఆయిల్‌పాం మొక్కలు, ఉత్పత్తులు, ట్రాక్టర్లు, యంత్రాలు, ఇతర పనిముట్లు, డ్రోన్ టెక్నాలజీ, నానో యూరియా లిక్విడ్, ఇతర సేంద్రీయ ఉత్పత్తులు ఈ అగ్రిటెక్‌ సౌత్‌లో ప్రదర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు ఈ ప్రదర్శన తిలకించేందుకు పోటెత్తుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ బి.గోపి, సీఐఐ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: