పెళ్లిళ్లు ముఖ్యమా.. అసెంబ్లీ ముఖ్యమా?
మేడిగడ్డపై మాట్లాడేందుకు రాకుండా.. నల్లగొండ సభకు వెళ్లి ప్రభుత్వాన్ని తిట్టడం ఏమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా సలహాలు ఇవ్వమంటే...ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని బయటపెట్టడానికి మేడిగడ్డకు పోయినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. అవినీతి ఎక్కడ బయట పెడుతుందో అని సభ నుంచి బయటికి పారిపోయారని ఆరోపించారు. పులి బయటికి రాలేదు కాని పిల్లి మాత్రం బయటికి వచ్చిందని కాంగ్రెస్ నేతలు అన్నారు. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ప్రాంగణలో ధర్నా చేయడం ఒక బూటకమన్నారు.