ఎన్నికల తర్వాత.. బీఆర్ఎస్ పరిస్థితి మరీ అంత దారుణమా?
సూర్యాపేట జిల్లా పల్కవీడు మండలం జాన్పహాడ్ సైదులు దర్గా వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 13-14 లోక్సభ స్థానాలలో విజయం సాధిస్తుందని, ఒకటి, రెండు స్థానాలకు బీఆర్ఎస్ పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో లోక్సభకు ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉందని ఆయన మంత్రి కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్ఘాటించారు. 13-14 సీట్లు గెలవడం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తెలంగాణ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు.