విజయశాంతా.. మాజాకా?: కాంగ్రెస్‌లోకి రాగానే పదవి?

Chakravarthi Kalyan
విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె అలా పార్టీలో చేరిందో లేదో..వెంటనే ఆమెను పార్టీ పదవి వరించింది. పార్టీ ప్రచారకమిటీ సమన్వయ కర్తగా ఆమెను కాంగ్రెస్ పార్టీ నియమించింది. మళ్లీ కాంగ్రెస్ లోకి రావడం చాలా సంతోషంగా ఉందన్న విజయశాంతి.. పాత మిత్రులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.  
బీజేపీని ఆ పార్టీ వల్లే నాశనం చేసుకున్నారని.. నా పై మీడియా కూడా తప్పుడు వార్తలు రాశారని.. మా గురువు అద్వానీ సభ్యత సంస్కారం నేర్పించారని విజయశాంతి అన్నారు. తాను శివ దీక్ష లో ఉన్నానని.. నా పై కొందరు నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడారని.. నేను ఒక ఉద్యమ నాయకురాలు నిజాయతి గానే ఉంటానని విజయశాంతి అన్నారు. నేను దేవుడిచ్చిన అన్న అని నేను అనలేదని.. కెసిఆర్ నే నన్ను దేవుడిచ్చిన చెల్లెలు అన్నారని విజయశాంతి గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: