తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరబోతున్నారు. ఆరో తారీకు ఆయన చేరతారని వార్తలు వచ్చాయి. అయితే... తాజాగా ఆంధ్రజ్యోతి ఆర్కే ఓ కొత్త విషయం బయటపెట్టారు. జగన్, సోనియా చేతులు కలిపారని రాసుకొచ్చారు. ఈ విషయం తెలిసిన తర్వాత తుమ్మల కూడా మనసు మార్చుకోవచ్చని ఆర్కే అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఇప్పుడు పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి చాలా వరకూ ఆశాజనకంగా ఉన్నాయి. హైదరాబాద్లోని సీమాంధ్రులను కూడా తమవైపు ఆకర్షించడానికి తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు వంటి వారిని చేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
అనూహ్యంగా జగన్ రెడ్డితో కాంగ్రెస్ సయోధ్య కుదుర్చుకోవడం వల్ల సెటిలర్లు దూరం అవుతారని ఆర్కే అంచనా వేస్తున్నారు. ఇప్పుడు తెరవెనక బాగోతం తెలిశాక తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు కూడా మనసు మార్చుకోవచ్చని అంటున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం అంటే సోనియా, రాహుల్, ప్రియాంక.. ఈ ముగ్గురికీ రాజకీయం పెద్దగా తెలియదని.. అధిష్ఠానం చుట్టూ ఉండే కోటరీ వారిని తప్పుదోవ పట్టిస్తోందని అంటున్నారు.