ఇన్స్టాలో ఫ్రెండ్షిప్.. 8 పెళ్లిళ్లు చేసుకున్న కిలాడీ?
ఈ ఏడాది మార్చి 30న పెళ్లి కూడా చేసుకున్నారు. కొన్ని రోజులకే గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో రషీద ఇంట్లో ఉన్న రూ.1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారు నగలతో పారిపోయింది. మూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. అయితే విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. నీలగిరి జిల్లా గూడలూర్కు చెందిన రషీద.. సామాజిక మాధ్యమాల్లో డబ్బున్న మగవారితో పరిచయం పెంచుకుంటుందని.. తర్వాత వారిని వివాహం చేసుకుంటుందని.. కొన్ని రోజుల తర్వాత నగదు, నగలతో పారిపోతుందని గుర్తించారు. ఈ అమ్మడి ఇప్పటి వరకూ 8 పెళ్లిళ్లు చేసుకుందట.