
కవిత కొత్త పోరాటం.. వర్కవుట్ అవుతుందా?
దీని కోసం మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కవిత నిర్ణయించారు. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు కవిత నిర్వహించనున్నారు. మహిళా బిల్లుకు మద్దతివ్వాలని కోరుతూ దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డులు వ్రాయనున్నారు. మహిళా బిల్లు ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా కవిత అనేక సామాజిక మాధ్యమాల్లో పోస్టర్ ను విడుదల చేశారు.