జోషి మఠ్‌లో ఏం జరుగుతోంది.. అంత రహస్యం ఏంటి?

Chakravarthi Kalyan
రోజురోజుకు కుంగుతున్న జోషి మఠ్‌ గురించి ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను హెచ్చరించింది. ఎలాంటి సమాచారం ప్రభుత్వానికి తెలియకుండా ఇవ్వొద్దని ఆంక్షలు విధిస్తోంది. అనధికార వార్తలతో జోషీమఠ్‌తోపాటు దేశవ్యాప్తంగా గందరగోళానికి దారితీస్తున్నట్లు జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ.. ఎన్‌డీఎంయే భావిస్తోంది. సమాచారాన్ని మీడియాతో గానీ, సామాజిక మాధ్యమాల్లో గానీ పంచుకోవద్దని చెబుతోంది. తగిన అనుమతి తీసుకోకుండా అనధికారికంగా వ్యాఖ్యలు చేయవద్దని ప్రభుత్వ విభాగాలకు ఎన్‌డీఎంయే స్పష్టం చేసింది.


జోషిమఠ్‌పై నిపుణుల కమిటీ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత వాటిని వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఎన్‌డీఎంయే చెబుతోంది.  హైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్‌ఐ తో పాడటు ఇతర  సంస్థలకు, వాటిలోని నిపుణులకు ఈ మేరకు ప్రత్యేక సూచనను ఎన్‌డీఎంయే పంపించింది. జోషిమఠ్‌ పరిస్థితిపై ఎవరికివారు భాష్యం చెబుతుండడంతో ఎదురయ్యే అయోమయాన్ని తొలగించడానికే ఈ ప్రయత్నం  చేస్తున్నామని ఎన్‌డీఎంయే అంటోంది. అయితే..  సమస్యను పరిష్కరించేబదులు సమాచారంపై ఆంక్షలు విధించడమేమిటని విపక్షాలు మండిపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: