ఇవేం హత్యారాజకీయాలు.. పవన్‌ సంచలన పోస్ట్‌?

Chakravarthi Kalyan
ఫ్యూడల్ ఆలోచనలున్న వారి పాలనలో అణగారిన వర్గాల వారు కనీసం గ్రామస్థాయి ఎన్నికల్లో కూడా పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా కామెంట్ చేశారు. నెల్లూరు జిల్లా కావలి గ్రామీణ మండలం తుమ్మలపెంట గ్రామంలో జనసేన తరపున ఎంపిటిసి గా పోటీ చేసిన బలికిరి ప్రణయ్ కుమార్ హత్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్పందించారు.

ప్రణయ్ ని వైసీపీ నేతలు హత్య చేశారని ఆయన తల్లి వరలక్ష్మి..  పవన్ కళ్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆవేదన చెందిన పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ పరిపాలించే అవకాశం వచ్చిన రోజుల్లో ఈ పరిస్థితి బాధాకరమని వీడియోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: