సినీ పరిశ్రమకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 1 నుంచే?
అత్యవసరమైతే ఆగస్టు 25 నుంచి ఛాంబర్ అనుమతితో షూటింగ్స్ చేసుకోవచ్చని సి.కళ్యాణ్ అన్నారు. దీనిపై దిల్ రాజు స్పందిస్తూ.. సినీ పరిశ్రమలోని సమస్యలపై 23 రోజులుగా రోజుకు ఐదారు గంటలు మాట్లాడుకున్నామని.. ఆగస్టు 30న మా తుది నిర్ణయాలు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెల్లడిస్తామని తెలిపారు. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లకు వీపీఎఫ్ సమస్య పరిష్కారమైందని.. తెలుగు రాష్ట్రాల్లో 1800 థియేటర్లున్నాయని.. సెప్టెంబర్ 2 నుంచి వీఫీఎఫ్ ఛార్జీలు వసూలు చేయడం లేదని.. టికెట్ ధరలు, తినుబండారాలు అందుబాటు ధరల్లోనే ఉంటాయని దిల్ రాజు తెలిపారు.