పయ్యావుల సెక్యూరిటీ.. ఏం జరుగుతోంది?

Chakravarthi Kalyan
టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ భద్రత వ్యవహారం విషయం గందరగోళం నెలకొంది. తన భద్రత విషయంలో అధికారులు గంటకో రకంగా వ్యవహరిస్తోన్నారని పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ ముందుగా భద్రత ఉప సంహరించి...ఆ తర్వాత కంటిన్యూ చేస్తున్నామని ప్రకటించారని అంటున్నారు. కొత్త గన్ మెన్ పయ్యావుల వద్దకు వచ్చి తనను వ్యక్తిగత భద్రత సిబ్బందిగా నియమించారని పయ్యావులకు నిన్న పరిచయం చేసుకున్నారు.

అయితే.. సంప్రదాయం ప్రకారం యూనిఫాంలో ఉన్న ఆర్ఐ వచ్చి పీఎస్ఓను మారుస్తున్నామన్న విషయాన్ని వెల్లడించాలని పయ్యావుల తెలిపారు. వచ్చిన వ్యక్తి గన్ మెన్ అవునో.. కాదో తనకు తెలియదని కేశవ్ పేర్కొన్నారు. ఆర్ఐ వచ్చి గన్ మెన్లను మార్చిన విషయాన్ని తెలిపి.. కొత్త పీఎస్వోను పరిచయం చేసిన వెంటనే విధుల్లో చేరమని గన్ మెన్ కు పయ్యావుల సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: