హవ్వ.. ఎన్టీఆర్‌ విగ్రహానికి వైసీపీ రంగులు?

Chakravarthi Kalyan

గుడివాడలో వైసీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేశారు. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసిపి రంగులు వేశారు. చంద్రబాబు మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలోనే ఈ  బొమ్ములూరు వుంది. ఈ  విషయం తెలుసుకొని బొమ్ములూరుకు చేరుకున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఇతర  టీడీపీ నేతలు అక్కడికి వెళ్లారు.
ఎన్టీఆర్ విగ్రహానికి వైకాపా రంగులు వేయడాన్ని  టీడీపీ నేతలు ఖండించారు. పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని శుద్ధి చేసారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న వైసీపీ రంగులు చెరిపి వేస్తూ పసుపు రంగులు వేశారు. టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కొడాలి నాని కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. తమ నాయకుడి విగ్రహానికి వైసీపీ రంగులు వేయడం దుర్మార్గమన్నారు. పార్టీ నాయకులు వెళ్లిన తర్వాత, వైసీపీ నేతలు బొమ్మలూరు టిడిపి కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో బొమ్ములూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: