ఈ ఎగిరే వంతెనలు భలే బావుంటున్నాయ్?
తాజాగా సముద్రంలో తేలియాడే బ్రిడ్జిని కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రారంభించింది. ఉడుపిలోని మాల్పే బీచ్ లో కర్ణాటకలోనే మెుట్టమెుదటి తేలియాడే బ్రిడ్జిని ప్రారంభించారు. బ్రిడ్జి వద్ద టూరిస్టుల రక్షణ కోసం 20 నుంచి 25 మంది సహాయకులను నియమించారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ లు వేసుకుని రావాలి. మెుత్తం వందమీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పు ఉన్న ఈ బ్రిడ్జి పై నడుస్తూ సముద్రపు అందాలను వీక్షించవచ్చు. ప్రస్తుతం 15 రోజులపాటు ఈ తేలియాడే బ్రిడ్జిని ట్రయల్స్ కోసం అందుబాటులో ఉంచారు. వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభిస్తారు.