ప్రశాంత్ కిషోర్. ఈయన గురించి పరిచయం అక్కర్లేదు. ఇటీవల ఆయన కూడా సొంత పార్టీ పెడుతున్నారని ప్రచారం జరిగింది. అందుకు కారణం ఆయన పెట్టిన సోషల్ మీడియా పోస్టే. అయితే ఇప్పుడు అదే పీకే.. దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. తాను రాజకీయ పార్టీ పెట్టట్లేదని క్లారిటీ ఇచ్చిన పీకే.. అక్టోబరు 2 నుంచి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అది కూడా ఏకంగా 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర. ఈ పాదయాత్ర బిహార్ పురోగతి కోసమట. అందుకే 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు పీకే తాజాగా ప్రకటించారు.
తాజాగా పీకే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. వచ్చే రోజుల్లో బీహార్లోని అనేక రంగాలకు చెందిన 18వేల మంది ప్రముఖులను కలిసి మాట్లాడతానని తెలిపారు. ఒకవేళ ప్రజలు ఓ రాజకీయ వేదిక కావాలనుకుంటే అప్పుడు తప్పుకుండా దాని గురించి ఆలోచిస్తానంటున్నాడు పీకే.