ఇండియా దెబ్బకు దిగొచ్చిన చైనా?
చైనా రావాలనుకునే భారతీయ విద్యార్థుల ఆందోళనలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చైనా ఇప్పుడు నీతులు చెబుతోంది. వారి రాకకు అవసరమైన నియమ నిబంధనలు, తమ దేశానికి వస్తున్న ఇతర దేశాల విద్యార్థుల అనుభవాల గురించి భారత ప్రభుత్వంతో చర్చించినట్లు చైనా చెబుతోంది. భారతీయ విద్యార్థులను అనుమతించడంపై పని ప్రారంభమైందని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.చైనాలో చదువుకునే విద్యార్థుల జాబితాను భారత్ అందిస్తే.. అందుకు ఏర్పాట్లు చేస్తామంటోంది.