కొత్త జిల్లా: కలెక్టర్కు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్?
అసలు ఈ విషయాన్ని స్థానిక ఆర్డీఓ తన దృష్టికి తీసుకురాలేదని బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. బొల్లాపల్లి మండలం ప్రజలు గురజాల డివిజన్ కు వెళ్లాలంటే సుమారు 55 కిలోమీటర్లు దూరం వెళ్లాలన్నారు. రహదారి సరిగ్గా లేకపోవడంతో ఆ మండలానికి చెందిన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఈ విషయాన్ని పట్టించుకుని బొల్లాపల్లి మండలాన్ని నరసరావుపేట డివిజన్ కు మార్చాలన్నారు. లేదంటే కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చుంటానని హెచ్చరించారు.