విశాఖలో ముందుకొచ్చిన సముద్రం.. కుంగిన భూమి..!
వేరే ప్రాంతంలో ఆర్.కే బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు దాదాపు 200 మీటర్ల వరకు భూమి కోతకు గురైంది. మరోవైపు భూమి కోతతో చిల్డ్రన్ పార్కులో ఉన్న బల్లలు విరిగిపోయాయి. చిల్డ్రన్ పార్కు సమీపంలో సముద్రంలో అలలు దాదాపు 10 అడుగుల మేర ఎగిసిపడ్డాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతంలోని పలు చోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి.
ఈ తరుణంలోనే ఆర్.కే.బీచ్ వద్దకు పర్యాటకులకు అనుమతించకుండా నిషేదించారు. ముఖ్యంగా సందర్శకులు అక్కడికి రాకుండా నోవాటెల్ హోటల్ ముందు అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసారు