హుజూరాబాద్ లో భారీ బహిరంగ సభ... కేసీఆర్ కు బండి షాక్...?

సీఎం‌ కేసీఆర్ సభకు దీటుగా హుజురాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈనెల‌ 27వరకు హుజురాబాద్ లోనే బండి సంజయ్ ఉండే అవకాశం ఉంది. 21నుంచి హుజురాబాద్ లో ప్రచారం స్పీడ్ గా చేసే ఆలోచనలో ఉన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, ఎంపీ అర్వవింద్, తదితరులు.
ఇప్పటికే ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే రఘనందనరావు స్పీడ్ గా వెళ్తున్నారు. సాయంత్రం ఢిల్లీ వెళ్ళనున్న  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్... పెద్దలకు పరిస్థితి వివరించే అవకాశం ఉంది. ప్రజా సంగ్రామ యాత్ర తర్వాత  మొదటిసారి ఢిల్లీ వెళుతున్నారు. ఉప ఎన్నికతో పాటు, హుజూరాబాద్ లో ప్రస్తుత పరిస్థితులను బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళనున్నారు ఆయన. జాతీయ పెద్దల సూచనతో హుజరాబాద్ లో దూకుడు పెంచారు. అటు ఈటెల రాజేంద్ర కూడా దూకుడుగా ప్రచారంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: