అత్తగారింటికి వచ్చి బైకులకు ఫైన్ వేసిన ఎస్సై..గ్రామస్తులు ఏమి చేశారంటే..?
చలానాలు కూడ భారీగానే ఉన్నాయి. ఓ బైకుకు రూ.5035 ఫైన్ వేయగా.. మరొక బైకుకు రూ.10,070 చలానా వేశాడు. ఆన్లైన్ ద్వారా రెండు ద్విచక్రవాహనాలకు జరిమానా విధించాడు. గతంలో వేసిన చలాన్లతో కలిపి మొత్తం అయిందా..? లేక తాజాగా భారీగా వేశారా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అత్తారింటికి వచ్చి జరిమానా వేసిన ఎస్సై శ్రీనివాస్ను పలువురు నిలదీశారు. ఎస్సై తీరుపై గ్రామానికి చెందిన వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎస్సై అత్తగారింటివద్దకు వచ్చిన గ్రామస్తులపై ఆయన సీరియస్ అయ్యారు. మరల దౌర్జన్యం కింద కేసు బుక్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు ఎస్సై. గ్రామస్తులు సైతం ఎస్సైకి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్బాబుకు ఫిర్యాదు చేస్తాం అని పేర్కొన్నారు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.