కొమురం భీం జిల్లాలో దారుణం..యువ జంట పై దుండగుల దాడి..!

కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. కాగజ్ నగర్ నుండి ఓ యువ జంట చింతలమనేపల్లి మండలం గంగాపూర్ వెళుతుండగా కడంబా అటవీప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దంపతుల వెంట పడటం తో భయం తో ఇద్దరూ అడవిలోకి పరుగులు తీశారు. అడవిలో పరుగులు తీసిన దంపతులు బంధువులకు సమాచారం ఇవ్వడం తో కొంత సమయానికి బంధువులు అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే దుండగులు ఆ జంటను వదిలి పారిపోయారు.

ఇద్దరికీ గాయాలు అవ్వడం తో కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. అయితే అటవీ ప్రాంతంలో జంటపై దాడి చేసింది ఎవరా అన్నది సంచలనం గా మారింది. ఆ ప్రాంతంలో పూర్తిగా అడవి ఉండటం అంతే కాకుండా రాత్రి వేళ కావడం తో జంట ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని అడవిలోకి పరుగులు తీశారు. మరోవైపు అదే అడవిలో పులి కూడా సంచరిస్తోంది..అనేక సార్లు ఆ ప్రాంతంలో రోడ్డుపై ప్రయాణికులకు పులి కనిపించింది కూడా. ఇక బాధితుల బంధువు లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను ఎలాగైనా పట్టుకుంటాం అని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: