తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. నిన్న ఉదయం మున్సిపల్ ఆఫీస్లోనే జేసీ!
ఇక నిన్న సాయంత్రం కొందరు అధికారులు జెసి చెప్పిన సమయానికి రావడంతో వారి నిబద్ధతతో మెచ్చుకుంటూ మోకాళ్ళ మీద నిలబడి మరి జేసీ ప్రభాకర్ రెడ్డి వారికి నమస్కారం చేశారు. ఇక మీటింగ్ కి రాని 26 మంది అధికారులకు నోటీసులు జారీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. మరోపక్క ఈ ఒత్తిడి భరించలేక మున్సిపల్ కమిషనర్ సెలవు మీద వెళ్లిపోయారు ఆయన తన స్థానంలో ఒక ఇన్చార్జి నియమించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు తాడిపత్రిలో టెన్షన్ పెడుతోంది.