ఏపీ సర్కార్ స్టూడెంట్ ఫ్రెండ్లీ !
నాన్న రాజశేఖర్ రెడ్డి కలను నెరవేర్చే బిడ్డగా జగన్ కు మంచి పేరుంది. ఆ దిశగా ఆయన పనిచేస్తున్నారు కూడా! కొన్ని సమస్య లున్నా ఆర్థికంగా ఏమంత బాగుండక పోయినా సరే ఈ రోజు ఫీజు రీ యింబెర్స్మెంట్ నిధులు విడుదల చేశారు ఏపీ సీఎం జగన్. జగనన్న విద్యా దీవెన పేరిట ఏటా అందించే విధంగానే రెండో విడత కింద పది లక్షల 97 వేల కోట్ల మంది విద్యార్థులకు మేలు చేసేల సంబంధిత నిధులు 693.81 కోట్లు విడుదల చేశారు. సాంకేతిక విద్య ను అభ్యసించే ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు డిగ్రీ విద్యార్థులకు సైతం ఈ పథకం ద్వారా లబ్ధి అందనుంది అని సీఎం జగన్ చెప్పారు. నాలుగు విడతల్లో చెల్లించే ఈ ఫీజు రీ యింబర్స్ మెంట్ ను రెండు విడతల్లో చెల్లించేందుకు లైన్ క్లియర్ చేశామని, మొదటి విడతకు సంబంధించిన నిధులను ఏప్రిల్ నెలలో 28వ తారీఖున విద్యార్థుల ఖాతాలకు జమ చేశామని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఐటీఐ విద్యార్థులకు పదివేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15 వేలు, డిగ్రీ, ఆపై కోర్సులు చదివే వారికి ఇరవై వేలు చొప్పున భోజన,వసతి ఖర్చుల నిమిత్తం చెల్లిస్తున్నామని వివరించారు.