ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ ఆమోదం కోసం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నెల 21, 22 తేదీల్లో సభ జరిగే అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశ పెడతారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయాన్ని బీఏసీ భేటీలో నిర్ణయించనున్నారు.ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం సాయంత్రం విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. 2021-22కు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగముండగా.. అనంతరం ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలపనున్నాయి. అయితే, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహించేందుకు అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.