మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య శుక్రవారం రోజు తీవ్ర అనారోగ్యం తో హైదరాబాద్లో మృతి చెందారు. ఈయన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత. గత 20 ఏళ్ళుగా హైదరాబాద్ లో ఉంటున్న బొగ్గారపు స్వస్థలం కామేపల్లి మండలం పండితాపురం గ్రామం. ఈయన స్వాతంత్య్ర సమరయోధుడు అంతే కాదు ప్రత్యక్షంగా నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. 1978లో తొలిసారిగా ఏర్పడిన సుజాతనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పువ్వాడ నాగేశ్వర్రావుపై గెలిచారు. హై కోర్ట్ లో న్యాయవాది గా పని చేసిన బొగ్గారపు సీతారామయ్యకు భార్య ఇద్దరు కుమారులతో పాటు నలుగురు కూతుళ్లు ఉన్నారు.