తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ ఎత్తున దొంగ ఓట్లు వేసిన వీడియోలు నిన్నంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక బీజేపీ సైతం ఈ దొంగ ఓట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు బీజేపీ కూడా ఈ తంతుపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య యుతంగా తిరుపతి ఉప ఎన్నిక జరగలేదన్నారు. ఈ ఎన్నికల్లో రెండు లక్షలకు పైగా దొంగ ఓట్లు పోలయ్యాయని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఇక పోలీసులు సైతం అధికార పార్టీకి వంత పాడారని... అధికారులు కూడా అధికార పార్టీకి సహకరించడంతో ఇష్టం వచ్చినట్లు దొంగ ఓట్లు వేసుకున్నారని ఆయన పైర్ అయ్యారు.