ఏపీలో పుర పోరుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న వేళ విపక్ష టీడీపీకి వరుస పెట్టి షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల అభ్యర్థులను కూడా నిలబెట్టుకోలేని దుస్థితిలో ఉన్న టీడీపీ ఎన్నికలకు రెండు రోజుల ముందు కూడా అభ్యర్థులను కాపాడు కోలేకపోతోంది. తాజాగా అనంతపురం కార్పొరేషన్ పరిధిలోని 35 వార్డు డివిజన్ టీడీపీ అభ్యర్థి గవ్వల లీలావతి, లోక్ నాథన్ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరిపోయారు. ఎన్నికలు మరో మూడు రోజులే ఉండడం.. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి వైసీపీలో చేరడంతో అక్కడ టీడీపీ ఓటమి ఖాయమైంది. టీడీపీ నేతలు మాత్రం అధికార పార్టీ బెదిరించి.. తమ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని పార్టీలో చేర్చుకుందని ఆరోపిస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: