ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా..!

N.ANJI
ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. తాజాగా విడుదల చేసిన బులెటిన్ లో గణాంకాలు ఊరట కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 43,044 నమూనాలు పరీక్షించారు. అందులో 753 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,54,764కు చేరింది. నిన్న ఒక్కరోజే 1,507 మంది వైరస్‌ బారినుంచి కోలుకున్నారు.
ఇప్పటివరకు రాష్ట్రం మొత్తం 8,29,991 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 17,892. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 13 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 6,881కు చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో  అత్యధికంగా 216 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇక, అనేక జిల్లాల్లో కరోనా నామమాత్రంగా ఉనికి చాటుకుంది.  అనంతపురం జిల్లాలో 4 పాజిటివ్ కేసులు మాత్రమే రాగా, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 12 కేసుల చొప్పున వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: