దేశ వ్యాప్తంగా ఐటి దాడులు...!
ఢిల్లీ, ఎన్సీఆర్తో పాటు ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ఉన్న ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. సుమారు 42 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తుంది. ఈ దాడుల్లో అధికారులు సుమారు 2.37 కోట్ల నగదు, 2.89 కోట్ల విలువైన బంగారం గుర్తించారు. ఇంకా అంతర్గతంగా ఐటి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.