ఆర్థిక వ్యవస్థ ను తీవ్రంగా నష్ట పరిచింది వారే..!
ఆర్టికల్ 370ని విపక్షాలు పునరుద్ధరిస్తామని పేర్కొనటంపై తీవ్ర విమర్శలు చేశారు. దళారులు, మధ్యవర్తులను కాపాడేందుకే నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.బిహార్ ప్రజలు.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కరోనా మహమ్మారిని సమర్థంగా కట్టడి చేయగలుగుతున్నారని పేర్కొంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు మోదీ. గాల్వాన్ లోయలో మరణించిన బిహార్ ముద్దుబిడ్డలు.. భారత మాత సగర్వంగా తలెత్తుకునేలా చేశారని పేర్కొన్నారు.