రికవరీలో వెనకబడుతున్న తెలుగు రాష్ట్రాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా నిర్ణయాలు తీసుకున్నా సరే రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రతీ రోజు కూడా 3 వేల కేసుల వరకు నమోదు అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఏపీలో తెలంగాణాలో కరోనా రికవరీ రేటు చాలా తక్కువగా ఉంది. 

 

కరోనా రికవరీ రేటు అధికంగా ఉన్న 21 రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణా లేవు.  కేసులు మాత్రం రోజు రోజుకి భారీగా పెరుగుతూ పోతున్నాయి గాని రికవరీ రేటు మాత్రం పెరగడం లేదు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. నిన్న ఏపీలో 1300 కేసులకు పైగా రాగా తెలంగాణాలో 1800 పైగా కేసులు వచ్చాయి అంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: