బ్రేకింగ్ : ఏబీ వెంకటేశ్వరరావు కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం..
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తాజాగా పిటిషన్ దాఖలు చేసింది, ఏబీ వెంకటేశ్వర కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ స్టే ఇవ్వాలంటూ కోరింది ఏపీ ప్రభుత్వం.
అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ జులై 6వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది, ఇక మరోవైపు ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పటికే కేవియట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఫిబ్రవరి 8వ తేదీన ఏపీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వరావు ను సస్పెండ్ చేసింది.