బ్రేకింగ్: జగన్ ఎవరికి భయపడరు... ఆయనకు ఒక్కరికే...!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడికి మినహా దేశంలో ఎవరికి భయపడే అవకాశం ఉండదు అని టీడీపీ మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన పాలన మీద చదువుకున్న వారు అందరికి అవగాహన వచ్చింది అని భవిష్యత్తులో మిగిలిన వారు అందరికి వస్తుందని జేసీ అన్నారు.
రమేష్ కుమార్ విషయంలో ఏపీ సర్కార్ హైకోర్ట్ కి వెళ్ళడంలో తప్పు లేదని కాని ఆయన్ను కమీషనర్ గా కొనసాగించకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. సిఎం వైఎస్ జగన్ కోర్ట్ లను లెక్క చేయడం లేదని అన్నారు. జగన్ పాలనకు గాను తాను 110 మార్కులు వేస్తా అని జేసి అన్నారు. 151 సీట్లు వస్తే నేనే రాజు నేనే మంత్రి అనుకోవడం తప్పని అన్నారు.