నీలం సహాని గడువు పెంపు...?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని గడువుని పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. ఆమె పదవి కాలం జూన్ నెలాఖరు తో ముగిస్తున్న నేపధ్యంలో సిఎం వైఎస్ జగన్ ఆమె పని తీరు నచ్చి మరో ఆరు నెలల పాటు ఆమె పదవీ కాలాన్ని పెంచే ఆలోచనలో ఉన్నారని సమాచారం. 

 

ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ఇందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. త్వరలోనే ఆమె పదవీ కాలం పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆమె సమర్ధత ఉన్న అధికారి అని, క్లిష్ట సమయాల్లో ఆమె అవసరం ఉంటుంది అని భావించి జగన్ ఆమెను కొనసాగించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. అటు మంత్రులు కూడా ఆమెను కొనసాగించాలి అని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: