బోనీ కపూర్ లవ్ స్టోరీ... రాఖీ కట్టిన శ్రీదేవిని ఎలా పెళ్లి చేసుకున్నాడంటే?
బోనీ కపూర్ శ్రీదేవిని మొదటిసారి సినిమాల్లో చూశాడు, ఆమెను చూసిన తర్వాత బోనీ శ్రీదేవిని తన సినిమాల్లో నటింపజేయాలని ప్లాన్ చేశాడు. ఎట్టకేలకు శ్రీదేవి తల్లిని కలుసుకుని ఆమెకు తన 'మిస్టర్ ఇండియా' సినిమాను ఆఫర్ చేశాడు. 'మిస్టర్ ఇండియా' కోసం శ్రీదేవి తల్లి ఆయనను 10 లక్షలు అడిగారు. అయితే బోనీ ఆమెకు 11 లక్షలు ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. 1987లో బోనీ కపూర్ తన 'మిస్టర్ ఇండియా' చిత్రానికి శ్రీదేవి సంతకం చేశారు.
బోనీ కపూర్ దర్శకత్వం వహించిన 'హమ్ పాంచ్' సినిమా సమయంలో మిథున్ చక్రవర్తి సలహా మేరకు శ్రీదేవి బోనీకి రాఖీ కట్టింది. ఈ సినిమా సమయంలో వారిద్దరూ స్నేహితులయ్యారు. ఆ స్నేహం ప్రేమగా మారింది. మిథున్ శ్రీదేవిని 1985లో వివాహం చేసుకున్నాడు. 1988లో మిథున్ చక్రవర్తి తన భార్యకు విడాకులు ఇవ్వనందున ఆయనతో విడిపోవాలని శ్రీదేవి నిర్ణయించుకుంది. మిథున్తో రిలేషన్షిప్లో ఉన్నప్పుడే బోనీ, శ్రీదేవిలపై రూమర్స్ వచ్చాయి. అందుకే శ్రీదేవిని సినిమా సెట్స్లో బోనీ కపూర్కి రాఖీ కట్టమన్నాడట మిథున్.
ఆమె రాఖి కట్టినప్పటికీ బోనీ శ్రీదేవిని ఎంతగానో ఇష్టపడేవాడు. ఆమె 'చాందిని' చిత్రం షూటింగ్లో ఉన్నప్పుడు బోనీ శ్రీదేవిని కలవడానికి స్విట్జర్లాండ్కు వెళ్లాడు. ఈ సమయంలో శ్రీదేవి తల్లి చనిపోవడంతో బోనీ శ్రీదేవితో చాలా సమయం గడిపాడు. బోనీ శ్రీదేవితో సెట్స్లో గడుపుతున్నాడని బాలీవుడ్లో వార్తలు హల్చల్ చేశాయి. ఈ విషయం ఆయన భార్యకు చేరింది. చివరికి బోనీ తాను శ్రీదేవితో సంబంధంలో ఉన్నానని అంగీకరించాడు. ఆ తరువాత అప్పటికే ఇద్దరు పిల్లలున్న బోనీ కపూర్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు.