చైనాకు ఇండియా షాక్.. సరిహద్దుల్లోకి యుద్ధ ట్యాంకులు?
సరిహద్దుల్లో తేలికపాటి యుద్ధ ట్యాంకులను ఇండియా మోహరించబోతోంది. ఇందు కోసం ట్యాంకులను సమకూర్చుకునేందుకు భారత సైన్యం సిద్ధమవుతోంది. ఈ ట్యాంకుల కోసం ఇండియా జొరావర్ అనే ప్రాజెక్టును చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కారణంగా ఇండియా ఆయుధ పాటవం పెరుగుతుంది.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తిప్పికొట్టడానికీ ఈ తేలికపాటి యుద్ధ ట్యాంకులు వీలు కల్పిస్తాయి. సైన్యం రూపొందించిన ఈ ప్రతిపాదనకు రక్షణ మంత్రిత్వశాఖ వచ్చే నెలలో ఆమోదం తెలపవచ్చు. ఈ నేపథ్యంలో తేలికపాటి యుద్ధ ట్యాంకుల కొనుగోలు అంశం సంచలనంగా మారబోతోంది.