ప్రేమ పెళ్లి: కోర్టులోనే భార్య గొంతు కోసేశాడు?

Chakravarthi Kalyan
వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఓ పిల్లాడు కూడా పుట్టాడు.. కానీ నాలుగేళ్లకే ఇద్దరి మధ్య విబేధాలు పొడచూపాయి. అవి పెరిగి పెద్దయ్యాయి. ఇక కలసి ఉండలేమనుకున్నారు. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాజీ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే కోర్టు కు వచ్చారు. కానీ.. అక్కడ భార్యను చూసి సదరు భర్త రెచ్చిపోయాడు.. కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసేశాడు.. కోర్టు ఆవరణలో భార్య గొంతు కోసి భర్త పరారైన ఘటన  హాసన జిల్లా హొళెనరసీపురలో జరిగింది.

భార్య గొంతు కోసిన భర్త శివకుమార్‌ ను హాసన జిల్లా హొళెనరసీపుర పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని హాసన జిల్లాలోని తట్టికెరె వాసి చైత్ర, శివకుమార్‌ ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం విడాకుల కోసం కోర్టుకెక్కారు. లోక్‌అదాలత్‌లో రాజీ కోసం వచ్చారు. విచారణ అనంతరం జడ్జి కేసును వాయిదా వేశారు. కుమారుడ్ని వెంటపెట్టుకుని వెళ్తున్న చైత్రను వెంబడించిన శివకుమార్ కోర్టు ఆవరణలోనే గొంతు కోసి పరారయ్యాడు. చికిత్స పొందుతూ చైత్ర మరణించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: