ఇవాళ ఆ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించనున్న జగన్

Chakravarthi Kalyan
ఇవాళ ఏపీ సీఎం జగన్.. విజయవాడలో 'వైఎస్‌ఆర్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించబోతున్నారు. ఈ పథకం కింద కొత్త వాహనాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. విజయవాడలో ఉదయం10.30 గంటలకు సీఎం జగన్ ఈ వాహనాలను ప్రారంభిస్తారు.
బెంజ్‌ సర్కిల్‌ వద్ద జెండా ఊపి లాంఛనంగా ప్రారంభింస్తారు.
మెుత్తం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పథకం కింద 500 వాహనాలు వచ్చాయి. వాటిలో శ్రీకాకుళం జిల్లాకు 23 వాహనాలు కేటాయించారు. విజయనగరం జిల్లాకు 33 వాహనాలు కేటాయించారు. విశాఖ జిల్లాకు  67  వాహనాలు కేటాయించారు. తూర్పు గోదావరి జిల్లాకు 62  వాహనాలు కేటాయించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు 33 వాహనాలు కేటాయించారు. కృష్ణా జిల్లాకు 33  వాహనాలు కేటాయించారు.  గుంటూరు జిల్లాకు 31 వాహనాలు కేటాయించారు.  ప్రకాశం జిల్లాకు 24  వాహనాలు కేటాయించారు. నెల్లూరు జిల్లాకు 19  వాహనాలు కేటాయించారు. చిత్తూరు జిల్లాకు 52  వాహనాలు కేటాయించారు. కడప జిల్లాకు 23  వాహనాలు కేటాయించారు. అనంతపురం జిల్లాకు 36  వాహనాలు కేటాయించారు. కర్నూలు జిల్లాకు 64  వాహనాలు కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: