సూపర్స్టార్ రజనీకాంత్కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ ఇవాళ లభించింది. మార్చి 21న ప్రకటించారు. గత నాలుగు దశాబ్దాలుగా రజిని సినీ పరిశ్రమకు చేస్తున్న విశేష సేవలకు కేంద్రప్రభుత్వం ఆయనను ఈ పురస్కారంతో సత్కరించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు ఈ అవార్డును అందజేశారు. అవార్డుల ప్రధానోత్సవంలో హీరో ధనుష్ అసురన్ చిత్రానికి ఉత్తమనటుడిగా అవార్డును అందుకున్నారు. ఒకే సంవత్సరంలో రజనీకాంత్, ఆయన అల్లుడు ధనుష్ అవార్డులు అందుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లేముందు రజనీకాంత్ ఫోయెస్గార్డెన్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తనకు లభించడం సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ అవార్డును తాను ఊహించలేదన్నారు రజిని. ఈ సమయంలో తన గురువు కె.బాలచందర్ లేకపోవడం బాధగా ఉందన్నారు. ఇక మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో.. సోమవారం రెండు సంతోషకరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, అందులో ఒకటి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకోవడం, రెండోది కూతురు సౌందర్య రజనీకాంత్ విశాకన్ హూట్ పేరుతో సోషల్ మీడియా యాప్ ప్రారంభించడం అని వెల్లడించారు.