చంద్రబాబుపై మచిలీపట్నం ఎంపీ ఆగ్రహం
కేంద్ర మంత్రి అమిత్ షా పై చంద్రబాబు రాళ్ల దాడి చేయించిన విషయం గుర్తుకు లేదా మండిపడ్డారు. చంద్రబాబు మరిచిపోయిన బీజేపీ నాయకులు మరిచిపోలేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక రాజకీయాలు చేయడంలో చంద్రబాబు, టీడీపీ కేరాఫ్ అడ్రస్గా మారాయని ఆగ్రహించారు. ఢిల్లీలో ఎన్నికల కమిషన్ను కలిసి టీడీపీని రద్దు చేయాలని కోరునున్నట్టు తెలిపారు. టీడీపీ అరాచక రాజకీయాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పారు. ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను కలిసి బాబు రాజకీయ వ్యవహారశైలి గురించి వివరిస్తాం అని వెల్లడించారు.