కృష్ణా బోర్డుకు తెలంగాణ మ‌రో లేఖ‌..త‌ర‌లింపులు ఆపాల్సిందే.. !

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రోసారి కృష్ణా బోర్డుకు మ‌రోసారి లేఖ రాసింది. ఈ లేఖ‌లో శ్రీశైలం జలాశయం నుండి ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా అక్రమ నీటి తరలింపును ఆపివేయాలని తెలిపింది. బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ద్వారా కె సి కాలువకు నీటిని తరలించడం వెంటనే ఆపివేయించాలంటూ పేర్కొంది. నీటి కేటాయింపులు లేని హెచ్ ఎన్ ఎస్ ఎస్ ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం నుండి ఎత్తిపోతలను త‌క్ష‌ణ‌మే ఆపివేయాలని పేర్కొంది. సుంకేశుల బ్యారేజి ద్వారా కె సి కాలువకు 39.90 టీఎంసీ ల నీటి  కేటాయింపులు ఉండాగా ప్రతీఏటా సరాసరి 54 టీఎంసీల తుంగభద్ర జలాలు తరలిస్తునారని ఆరోపించింది. 

ఆర్డీఎస్ కు 15.90 టీఎంసీల‌ కేటాయింపులు ఉండగా సరాసరి 5 టీఎంసీలకు మించి తరలించడం సాధ్యం కావడంలేదని స్ప‌ష్టం చేసింది. తుంగభద్ర జలాలకు అదనంగా కె సి కాలువకు కృష్ణా జలాలను శ్రీశైలం నుండి తరలించడం అక్రమమంటూ తెలంగాణ ప్ర‌భుత్వం పేర్కొంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జలాల్లో శ్రీశైలం నుండి 39 టీఎంసీ లు మాత్రమే తరలించాల‌ని లేఖ‌లో స్ప‌ష్టం చేసింది. కానీ ఈ తరహా కేటాయింపులు లేని అక్రమ లిఫ్ట్ ల ద్వారా తన పరిమితికి మించి నీటిని ఎత్తి పోసుకుంటున్నదని వెల్లడించింది. కాబట్టి ట్రిబ్యునల్ ద్వారా ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరిపే వ‌ర‌కూ లిఫ్ట్ ల ద్వారా నీటి కేటాయింపులను కేఆర్ఎంబీ నిరోధించాల‌ని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: