అమరావతి : వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తన పార్టీ గెలుస్తుందట అంటూ ఎద్దేవా చేశారు.దానికి కారణం ప్రజలు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తుండటమే అంట అంటూ ట్విట్ చేశారు విజయసాయిరెడ్డి.ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని డిపాజిట్ దక్కితే చాలనుకున్న సంగతి ప్రజలింకా మర్చిపోలేదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. బకాస్ మాటలతో నవ్వులు పాలు కావొద్దు చంద్రం అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు.