లాక్ డౌన్ వారిని వ్యాపారవేత్తలుగా మార్చింది ?
ఆశిష్ మరియు అంకుష్ లు అక్టోబర్ 2020 వ సంవత్సరంలో ఈ జమ్మూ బాస్కెట్ యాప్ ను స్టార్ట్ చేశారు. ఎప్పటికైనా ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మాన్ కావాలనుకునే కలను సాధించి చూపించాడు ఆశిష్. మొదటగా ఒక జమ్మూ కే పరిమితమైన ఈ స్టార్టప్ మెల్ల మెల్లగా దేశ వ్యాప్తంగా తన సేవలను అందిస్తోంది. వీరు ముఖ్యంగా జమ్మూలో పండే వస్తువులనే అమ్మడం అనేది గొప్ప విషయం. అందుకే ఇక్కడకు వచ్చే సందర్శకులు సైతం ఈ కాశ్మిరీ వస్తువులను కొనడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. వాటిలో షప్నినా షాల్, తీ లేదా డ్రై ఫ్రూట్స్ లాంటివి ఉన్నాయి.
ఆశిష్ ఒక ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత గురుగ్రామ్ లో వి-మార్ట్ రిటైల్ లిమిటెడ్ మరియు ల్యాండ్ మార్క్ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. మొట్ట మొదటిగా వీరికి ఈ ఆలోచన వచ్చిన సమయంలో యాప్ లేదు. కానీ వీరు కొన్ని వస్తువులను వాట్సాప్ మరియు పేస్ బుక్ లోనే అమ్మడం ప్రారంభించారు. ఇలా వారి ఉత్పత్తులకు మంచి పేరు రావడంతో కొంత డబ్బుతో స్టార్టప్ ను స్టార్ట్ చేశారు. ఇలా తక్కువ వయసులోనే ఒక బిజినెస్ మాన్ గా మారినందుకు సంతోషంగా ఉందని వీరిద్దరూ తెలిపారు. ఇప్పుడు చాలా హాయిగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు.